telugu navyamedia
రాజకీయ వార్తలు

రైలు ప్రమాద ఘటనపై అమిత్‌ షా దిగ్భ్రాంతి

amith shah bjp

మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ వద్ద ఈ రోజు తెల్లవారుజామున జరిగిన రైలు ప్రమాద ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాద ఘటనలో వలస కార్మికులు ప్రాణాలు కోల్పోవడం విచారకరమని షా పేర్కొన్నారు. ఈ ప్రమాద ఘటనపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌తో పాటు సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడానని హోంమంత్రి తెలిపారు. మృతుల కుటుంబాలకు హోంమంత్రి అమిత్‌ షా ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మహారాష్ట్ర ఔరంగాబాద్‌ సమీపంలోని కర్మాడ్‌ వద్ద రైల్వే ట్రాక్‌పై వలస కార్మికులు నిద్రిస్తున్న క్రమంలో వారిపై నుంచి గూడ్స్‌ రైలు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 16 మంది మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు, క్షతగాత్రులంతా మధ్యప్రదేశ్‌కు చెందిన వారుగా గుర్తించారు.

Related posts