దేశంలో కరోనా వ్యాప్తికి తబ్లిగీ జమాతే కారణమని ఆరోపణలు వెల్లువిరుస్తున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మండిపడ్డారు. కరోనా వైరస్ బారినపడడం నేరమేమీ కాదని, కానీ వైరస్ సోకినా దాచి ఉంచడమే అసలైన నేరమని స్పష్టం చేశారు. ఆ విధమైన నేరాలకు పాల్పడిన వారిపై చర్యలు తప్పవన్నారు.
తబ్లిగీ జమాత్ తో సంబంధం ఉన్నవాళ్లు ఈ తరహా నేరానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారంలో తబ్లిగీ జమాత్ పాత్ర ఖండించదగినదని అభిప్రాయపడ్డారు. ఉత్తరప్రదేశ్ లో కానీ ఇతర ప్రదేశాల్లో కానీ కరోనా వ్యాప్తి వెనుక తబ్లిగీ జమాత్ ఉందన్నారు. ఉంది.కరోనాను దాచి పెట్టకుండా ఉంటే కరోనా మరింత మందికి సోకకుండా నివారించగలిగే వాళ్లమని పేర్కొన్నారు.