రాష్ట్రంలో కరోనా నివారణా చర్యలపై ఏపీ సీఎం జగన్ సమక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర హోంశాఖ మార్గరద్శకాల ప్రకారం వలస కూలీలకు మాత్రమే రాష్ట్రంలోకి అనుమతిస్తారని తెలిపారు. మిగితావాళ్లు అక్కడే ఉండాలని పొరుగు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలను విజ్ఞప్తి చేశారు. సరిహద్దుల వద్దకు వచ్చి ఇబ్బందులు పడొద్దని సూచించారు.
వేల సంఖ్యలో ఉన్న వలస కూలీలను తీసుకొచ్చి క్వారంటైన్ లో పెడుతున్నామని అన్నారు.వైద్య పరీక్షలు చేసి, వారికి సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. అందువల్ల మిగిలిన వారు ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వైరస్ దృష్ట్యా ఎక్కడివారు అక్కడే ఉండటం క్షేమకరమని చెప్పారు. ప్రయాణాల వల్ల వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదముందని, ప్రభుత్వ సూచనలను ఎప్పటికప్పుడు పాటించాలని కోరారు.