telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కోర్టులు తిడుతున్నా కేసీఆర్‌కి చీమకుట్టినట్టైనా లేదు: రేవంత్ రెడ్డి

Revanth-Reddy mp

తెలంగాణలో కరోనా విజృంభించడంతో రోజురోజుకూ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కేసులు భారీగా పెరిగిపోతుంటే సీఎం కేసీఆర్ ఈ విషయాన్ని పట్టించుకోవట్లేదని విమర్శలు గుప్పించారు. ‘కరోనా కల్లోలంతో ప్రజలు చస్తున్నా, కోర్టులు తిడుతున్నా సీఎంకు చీమకుట్టినట్టైనా లేదని దుయ్యబట్టారు.

“ఎవడి పిచ్చి వాడికి ఆనందం” అన్నట్టు కరోనా సమస్యను గాలికి వదిలేసి సచివాలయంపై 11 గంటల సుదీర్ఘ సమీక్ష చేయడం సీఎం బాధ్యతారాహిత్యానికి పరాకాష్ఠ’ అని రేవంత్ రెడ్డి విమర్శించారు.ఈ సందర్భంగా ఓ దినపత్రికలో వచ్చిన వార్తను రేవంత్ రెడ్డి పోస్ట్ చేశారు. ప్రగతిభవన్‌లో కేసీఆర్ నిన్న మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 11 వరకు సుదీర్ఘ సమావేశం జరిపినట్లు అందులో పేర్కొన్నారు. కొత్త సచివాలయంలో కార్యాలయాలు, పేషీలు, అంతస్తుల విస్తీర్ణాలపై చర్చ జరిగిందని చెప్పారు.

Related posts