telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఇంటర్‌లో 94 శాతం మార్కులొచ్చిన అమ్మాయికి తాప్సి సర్‌ప్రైజ్ గిఫ్ట్

Taapsee

మంచి పనులు చేస్తూ రియల్ హీరో అనిపించుకుంటున్న సోనూసూద్‌ చూపిన మార్గంలో నడవడానికి సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా ముందుకొస్తున్నారు. హీరోయిన్ తాప్సీ పన్ను కూడా ఓ మంచి పని చేసి వార్తల్లో నిలిచారు. పీయూసీ పరీక్షల్లో 94 శాతం మార్కులు తెచ్చుకున్న ఓ స్టూడెంట్‌కు పై చదువుల కోసం స్మార్ట్ ఫోన్ అవసరమైంది. ‘నా కూతురికి 94 శాతం మార్కులొచ్చాయి.. కరోనా కారణంగా చదువుకోవాలంటే స్మార్ట్ ఫోన్ అవసరం. సాయం చేయండి ప్లీజ్’ అని అమ్మాయి తండ్రి అభ్యర్థించాడు. ఈ విషయం తెలుసుకున్న తాప్సీ ఆమెకు ఐఫోన్ కొనిచ్చారు. అనంతరం తాప్సీ మాట్లాడుతూ.. “మరింత మంది అమ్మాయిలు చదువుకోవాలి. ప్రతి చిన్నారి చదువుకోవాలి. మనకు మరింత మంది డాక్టర్లు కావాలి. రేపటి భారతాన్ని మరింత మెరుగైన దేశంగా మార్చడానికి నేను అందించే చిరు సాయం ఇది’ అని వ్యాఖ్యానించారు. కర్ణాటకకు చెందిన ఆ అమ్మాయికి గురువారం ఫోన్ అందింది. ఆ అమ్మాయి తనకు ఐఫోన్ వచ్చిందనే విషయాన్ని నమ్మలేకపోయింది. తాప్సీ మేడం దగ్గర్నుంచి నాకు ఐఫోన్ వచ్చింది. నమ్మలేకపోతున్నానంటూ ఆనందం వ్యక్తం చేసింది. నీట్‌లో మంచి ర్యాంక్ సాధించడానికి మరింత కష్టపడతాను. మీ ఆశీస్సులు నాకు ఉండాలి” అని కోరుకుంది. తాప్సీ పబ్లిసిటీ కోసమే ఫోన్ కొనిచ్చిందని ఓ వ్యక్తి కామెంట్ చేయగా.. “అయితే మీరు కూడా ట్రై చేయండి” అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చింది తాప్సి.

Related posts