telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“గరుడవేగ” సీక్వెల్ లో రాజశేఖర్ కూతుర్లు…?

Rajasekhar

యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ కుమార్తెలు శివానీ, శివాత్మిక గురించి అందరికి తెలిసిందే. గత ఏడాది శివాత్మిక “దొరసాని” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అయితే ఈ ఇద్దరు సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉన్నారు. అయితే త్వరలో శివానీ, శివాత్మిక కలిసి ఓ సినిమాలో నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. తమ తండ్రి నటించి సూపర్ హిట్ అందుకున్న “గరుడ వేగ” సినిమా సీక్వెల్ లో నటించనున్నారు అని సమాచారం. “గరుడ వేగ” దర్శకుడు ప్రవీణ సత్తారు మళ్ళీ ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహించనున్నారు అని తెలుస్తుంది. అయితే లాక్ డౌన్ ముగిసిన తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం.

Related posts