telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఆనంద‌య్య మందు పంపిణీ కోసం మొబైల్ యాప్…

ఆనంద‌య్య కరోనా మందుకి నిన్న ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో… ఈ మందు పంపిణీ పై చర్చ జరుగుతుంది. ప్రస్తుతం ఈ మందు త‌యారీ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు ఆనంద‌య్య ఆయన బృందం. అయితే రేప‌టి నుంచి మందు త‌యారీ జ‌రుగ‌నున్న‌ది. అయితే ఈ రోజు క‌లెక్ట‌ర్‌తో ఆనంద‌య్య స‌మావేశం అయ్యారు. మందు పంపిణీపై చ‌ర్చించారు. కృష్ణ‌ప‌ట్నం ఎవ‌రూ ర‌వొద్ద‌ని, ఆన్‌లైన్ లో మందు పంపిణీ చేస్తామ‌ని క‌లెక్ట‌ర్ పేర్కొన్నారు. ఆన్‌లైన్ లో మందు పంపిణీకి మొబైల్ యాప్ ఏర్పాటు చేస్తున్న‌ట్టు తెలిపారు. పంపిణీకి మ‌రో 5 రోజుల సమ‌యం ప‌డుతుంద‌ని అంద‌రికీ తప్పకుండా మందు పంపిణీ జ‌రుగుతుంద‌ని క‌లెక్ట‌ర్ చ‌క్ర‌ధ‌ర్‌బాబు తెలిపారు. ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో మందును వేగంగా త‌యారు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. చూడాలి మరి ఈ మందు పంపిణీ ఎలా జరగనుంది అనేది.

Related posts