telugu navyamedia
రాజకీయ వార్తలు

ప్రశాంత్ కిశోర్ తో రజనీకాంత్ భేటీ

rajinikanth on loksabha election support

ట్రబుల్ షూటర్( పీకే) ప్రశాంత్ కిశోర్ తో సినీ నటుడు రజనీకాంత్ భేటీ అయ్యారు. వీరి భేటీ ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో ఏ విధంగా ముందకు వెళ్లాలి అన్న విషయంపై పీకే రజనీకాంత్ కు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. ప్రశాంత్ కిశోర్ ఎవరి కోసం పనిచేస్తే.. వాళ్లు ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధిస్తారనే నమ్మకం ఉంది. అందుకే రజనీ ఆయనను సంప్రదించినట్లు తెలుస్తోంది.

రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ఆయనను ఓ రాజకీయ నాయకుడిగా చూడాలని అభిమానులు కూడా ఎంతగానో కోరుకుంటున్నారు. ఎట్టకేలకు రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు గత 2017 డిసెంబర్‌లోరజనీ ప్రకటించాడు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తన అభిమాన సంఘాలను రజనీ ప్రజా సంఘాలుగా పేరు మార్చారు. అభిమానులతో భేటీ అయ్యి వారికి రాజకీయపరమైన దిశా నిర్ధేశం చేశారు. రాష్ట్రంలోని 234 నియోజకవర్గాల్లోనూ పోటీ చేయాలన్న రజనీ నిర్ణయం తెస్సుకున్నట్టు తెలుస్తోంది.

Related posts