telugu navyamedia
వార్తలు సామాజిక

దేశంలో కరోనా మహోగ్రరూపం.. 54 లక్షలు దాటిన కేసుల సంఖ్య

corona covid

దేశంలో కరోనా వైరస్ మహోగ్రరూపం దాల్చడంతో రోజురోజుకూ భారీ సంఖ్యలో కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. గతంలో పట్టణాలకే పరిమితమైన ఈ మహమ్మారి ప్రస్తుతం గ్రామాలను కూడా వణికిస్తోంది.

దీంతో ఇప్పటివరకు దేశంలోని మొత్తం కేసుల సంఖ్య 54 లక్షల మార్కును దాటింది. గత 24 గంటల్లో 92,605 కేసులు నమోదయ్యాయి. వీటితో మొత్తం కేసుల సంఖ్య 54,00,620కి పెరిగినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన బులెటిన్ ద్వారా తెలుస్తోంది.

దేశంలోని మొత్తం కేసుల్లో 10,10,824 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. అలాగే, మొత్తంగా 43,03,044 మంది కోలుకున్నారు. 86,752 మంది కరోనా కాటుకు బలయ్యారు. ఇక రాష్ట్రాల వారీగా చూస్తే మహారాష్ట్రలో 3,01,273 కేసులు యాక్టివ్‌‌గా ఉండగా, కర్ణాటకలో 1,01,148, ఆంధ్రప్రదేశ్‌లో 84,423, ఉత్తరప్రదేశ్‌లో 67,825, తమిళనాడులో 46,506 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

Related posts