telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వైసీపీ నేతలు కలలు కంటున్నారు: సోమిరెడ్డి

Minister somireddy resign Mlc

ఏపీ కేబినెట్ సమావేశం జరుగనున్న నేపథ్యంలో వైసీపీ చేస్తున్న వ్యాఖ్యలపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. తెలుగుదేశం ప్రభుత్వానికి ఇదే చివరి కేబినెట్ సమావేశం అంటూ వైసీపీ చేస్తున్న వ్యాఖ్యలపై ద్వజమెత్తారు. టీడీపీ కీ ఇదే చివరి కేబినెట్ సమావేశమని వైసీపీ నేతలు కలలు కంటున్నారని అన్నారు. ప్రజలకు ఎంతో చేసిన తమను గెలిపించకుండా రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడే వైసీపీని గెలిపిస్తారని ఎందుకు అనుకుంటున్నారని సోమిరెడ్డి ప్రశ్నించారు.

ఏపీ కేబినెట్ సమావేశం పంతం కోసం నిర్వహిస్తోంది కాదని, ప్రభుత్వానికి ఉన్న హక్కులను పూర్తి స్థాయిలో వినియోగించుకుని నిర్వహిస్తున్న సమావేశమని స్పష్టం చేశారు. ఈ రోజు సాయంత్రం ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సాగు, తాగునీరు, కరవు, ‘ఫణి’ తుపాన్, ఉపాధి హామీ అంశాలపై కేబినెట్ సమావేశంలో చర్చ జరిగే అవకాశముంది.

Related posts