విశాఖ జనసేన ఎంపీ అభ్యర్థి మాజీ జేడీ లక్ష్మీనారాయణ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ వాసులకు 24 గంటలు అందుబాటులో ఉంటానని, అనుమానం ఉంటే బాండ్ పేపర్ మీద రాసిస్తానని పేర్కొన్నారు. తాను ఫుల్ టైం రాజకీయ నేతనని చెప్పారు. మాఫియాలు సపోర్ట్ చేసే నాయకులు కావాలా, సమర్థవంతమైన నాయకులు కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తామని వెల్లడించారు. మిగతా పార్టీలు డబ్బులు ఇచ్చి ముందుకు వస్తే.. జనసేన మాత్రం ఆ గబ్బును వదిలించడానికి ముందుకు వచ్చిందని పేర్కొన్నారు.