telugu navyamedia
రాజకీయ

విజయం వైపు ద్రౌపది ముర్ము..

రాష్ట్రపతి ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు కొన‌సాగుతుంది. రెండో రౌండ్‌లోనూ ఎన్​డీఏ అభ్యర్థి ద్రౌపదీ ముర్ము ద్రౌపది ముర్ము ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

రెండో రౌండ్‌లో పది రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓట్లను లెక్కించారు. 1,138 ఓట్లు చెల్లుబాటు కాగా.. వాటి మొత్తం విలువ 1,49,575.. ఇందులో ద్రౌపది ముర్ముకు1,05,299 విలువగల 809 ఓట్లు. యశ్వంత్‌ సిన్హాకు 44,276 విలువ గల 329 ఓట్లు పడ్డాయి.

ద్రౌపది ముర్ముకు పోలైన ఓట్లు చూస్తుంటే అంచనాలకు మించి మెజార్జీతో గెలిచే అవకాశం కనిపిస్తోంది.. 75 శాతానికిపైగా ఓట్లు ఆధిక్యంలో ఉన్నారు

ప్ర‌స్తుతం మూడో రౌండ్‌ కౌంటింగ్‌ కొనసాగుతోంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక రాష్ట్రపతి ఎన్నికల విజేతను ప్రకటించనున్నారు.మరోవైపు బీజేపీ ప్రధాన కార్యాలయంలో వేడుకలకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. పెద్ద సంఖ్యలో జనం అక్కడ గుమిగూడారు..

మొద‌టి రౌండ్ లో

రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ లో . మొత్తం 748 మంది పార్లమెంటు సభ్యుల ఓట్లను అధికారులు లెక్కించారు. ఈ ఓట్ల విలువ 5,23,600. ఇందులో 3,78,000 విలువైన 540 ఓట్లను ఎన్​డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము దక్కించుకున్నారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్​ సిన్హాకు 1,45,600 విలువైన 208 ఓట్లు పడ్డాయి. 15 మంది ఎంపీల ఓట్లు చెల్లకుండా పోయాయి.

Related posts