మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి ఇటీవల అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన 1994, 2004లో శాసనసభ్యుడిగా గెలిచారు. ఒక దఫా ఇండిపెండెంట్ గా, మరోసారి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. గత కొన్నిరోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం హైదరాబాదులో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఎడ్మ కిష్టారెడ్డి కుటుంబ సభ్యులను ఏపీ సీఎం జగన్ ఫోన్ ద్వారా పరామర్శించారు. కిష్టారెడ్డి కుమారుడు సత్యంకు ఫోన్ చేసిన సీఎం జగన్ నిబ్బరంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్ వచ్చినప్పుడు తప్పకుండా కలుస్తానని తెలిపారు. ధైర్యంగా ముందుకు సాగాలని అన్నారు.
రోజా నేను మంచి స్నేహితులం: ప్రియారామన్