టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. వినాయకచవితి సందర్భంగా ఓ మీడియా చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ రాజకీయంగా తాను ఎదగలేకపోయానన్న అసంతృప్తి ఇప్పటికీ ఉందని తెలిపారు. ఒకడు మోసం చేసినందువల్లే తన రాజకీయ జీవితం నాశనం అయిందని అన్నారు.
నమ్మక ద్రోహం చేశాడని, ఇద్దరం కలిసి ఓ వ్యాపార సంస్థ పెడితే మోసం చేశాడని వివరించారు. ఆ తర్వాత అతను సీఎం కూడా అయ్యాడని చెప్పారు. చచ్చినపామును కొట్టకూడదు కాబట్టి వదిలేశానని వ్యాఖ్యానించారు.
నిర్భయ నిందితులతో పాటే ఆమెను కూడా జైల్లో… కంగనా సంచలన వ్యాఖ్యలు