telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వైసీపీలో డొక్కా చేరడంపై అంబటి హర్షం

YCP Ambati Slams to JD Laxminaryana

మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరాడు. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీలో డొక్కా చేరికను శుభపరిణామంగా భావిస్తున్నామని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో డొక్కాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అన్నారు.

వైఎస్ హయాంలో పలు శాఖల్లో ఆయన కీలక పదవులు నిర్వహించారని గుర్తుచేశారు. గతంలోనే ఆయన తమ పార్టీలో చేరాల్సి ఉందని, అయితే, అనివార్య కారణాల వల్ల చేరలేకపోయారని చెప్పారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన డొక్కా పేరు ప్రఖ్యాతులు పొందిన వ్యక్తి, అని కొనియాడారు. ఆయన వైసీపీలో చేరడం తమ పార్టీకి కొంత మేరకు బలాన్ని చేకూరుస్తుందని అంబటి అన్నారు.

Related posts