telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ప్రజాస్వామ్యంపై నమ్మకం నిలబెట్టిన తీర్పు: సుజనా చౌదరి

4 directors arrested from sujana chowdary offices

 నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌‌ను ఎస్‌ఈసీగా కొనసాగించాల్సిందేనని ఏపీ హైకోర్టు తేల్చిచెప్పింది. ఎస్ఈసీ గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తొలగింపు ఆర్డినెన్స్ ను హైకోర్టు వేసింది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ సుజనా చౌదరి సోషల్ మీడియాలో స్పందించారు.

ఏపీ ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కొనసాగవచ్చంటూ హైకోర్టు తీర్పు ఇవ్వడం పట్ల సుజనా హర్షం వ్యక్తం చేశారు. రాజ్యాంగ వ్యవస్థలు, ప్రజాస్వామ్యంపై నమ్మకాన్ని హైకోర్టు తీర్పు నిలబెట్టిందని వ్యాఖ్యానించారు. ఏపీ సర్కారు ఇప్పటికైనా తప్పు తెలుసుకుని కోర్టు తీర్పును గౌరవించాలని సుజనా హితవు పలికారు.

Related posts