ప్రముఖ సినీ నటి ప్రియారామన్ బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. బుధవారం తిరుపతిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యమూర్తి సమక్షంలో ఆమె బీజేపీ తీర్థం పుచ్కుకున్నారు. అనంతరం ప్రియారామన్ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యే రోజా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రజాసేవ కోసమే బీజేపీలో చేరానని ప్రియారామన్ చెప్పారు. రోజా నేను మంచి స్నేహితులమని, పోటీదారులం మాత్రం కాదని స్పష్టం చేశారు. ఏపీ రాజకీయాలపై తాను ఇప్పుడే చెప్పలేనని ప్రియా రామన్ స్పష్టం చేశారు. పార్టీ ఏం చేయాలని ఆదేశిస్తే తాను ఆ పని చేస్తానని ఆమె అన్నారు.