బాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా తాజాగా నటించిన “డ్రీమ్ గర్ల్” చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం బాక్సాఫీస్ని షేక్ చేస్తుంది. ఆద్యంతం వినోదాత్మకంగా సాగే ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. సెప్టెంబర్ 13న విడుదలైన డ్రీమ్ గర్ల్ మంచి టాక్తో ప్రదర్శించబడుతోంది. ఈ మూవీ నెల రోజుల్లో రూ.140 కోట్లు వసూలు చేసి ఆయుష్మాన్ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. గతేడాది ఆయుష్మాన్ నటించిన బఢాయి హో చిత్రం రూ.138 కోట్లు వసూలు చేయగా..తాజాగా ఈ కలెక్షన్లను డ్రీమ్ గర్ల్ సినిమా కేవలం నెల వ్యవధిలోనే అధిగమించింది. రాజ్ శాండిల్య దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో నుష్రత్ బరూచా ఆయుష్మాన్ కు జోడీగా నటించగా..అన్నూ కపూర్ కీలకపాత్రలో కనిపించాడు. పూజా అనే అమ్మాయిగా ఆయుష్మాన్ నటన ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది. ఆయుష్మాన్ ఇటీవల “అంధాదున్” చిత్రానికి గాను నేషనల్ అవార్డ్ అందుకోగా, ఆయన నటించిన విక్కీ డోనార్, ఆర్టికల్ 15 చిత్రాలు, డ్రీమ్ గర్ల్ చిత్రాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. ప్రస్తుతం అమర్ కౌశిక్ దర్శకత్వంలో బాలా అనే సినిమా చేస్తున్న ఆయుష్మాన్ ఖురానా సూజిత్ సర్కార్ దర్శకత్వంలో గులాబో సితాబో, హితేష్ కెవల్య దర్శకత్వంలో శుభ్ మంగళ్ జ్యాండ సావధాన్ అనే చిత్రాలు చేస్తున్నాడు.
previous post