telugu navyamedia
సినిమా వార్తలు

అందరినీ ఆకర్షిస్తున్న ఎన్నారైల వెబ్ సిరీస్ “కాక్‌టైల్ డైరీస్”

Cocktail

అమెరికాలో తెలుగు ఎన్నారైలు “కాక్‌టైల్ డైరీస్-అమెరికాలో మనం” అనే పేరుతో ‘నక్షత్రం ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై వేణు అనే ఎన్నారై వెబ్ సిరీస్‌ను నిర్మిస్తున్నారు. సాయిరాం పల్లె దర్శకత్వం వహిస్తూ నటిస్తున్న ఈ వెబ్ సిరీస్‌లో చైతన్య పోలోజు, దివ్య, స్వాతి రెడ్డి, తదితర ఎన్నారైలు కీలక పాత్రలు చేస్తున్నారన్నారు. వాషింగ్టన్ డీసీ మెట్రో ఏరియాలోనే ఈ వెబ్ సిరీస్‌ను చిత్రీకరిస్తున్నట్టు మరో నిర్మాత అవంతిక తెలిపారు. ఈ వెబ్‌సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. ఆ ట్రైలర్‌కు తెలుగు ప్రేక్షకులందరి నుంచి భారీ రెస్పాన్స్ వస్తున్నట్లు నిర్మాత వేణు తెలిపారు. యూనైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని విభిన్న ప్రాంతాల్లో ఉండే తెలుగు ఎన్నారైల లైఫ్‌స్టయిల్ ఆధారంగా ‘కాక్‌టైల్ డైరీస్’ వెబ్ సిరీస్‌ను రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఈ వెబ్ సిరీస్‌ను జూన్‌లో విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Related posts