telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రధానమంత్రితో మంచు ఫ్యామిలీ భేటీ

Manchu

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఫ్యామిలీ సోమవారం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన విషయం తెలిసిందే. మోహన్ బాబుతో పాటు ఆయన కుమారుడు, కుమార్తె మంచు విష్ణు, మంచు లక్ష్మి, కోడలు విరానికా.. మోదీతో సోమవారం ఉదయం భేటీ అయ్యారు. నరేంద్ర మోదీతో మంచు ఫ్యామిలీ సమావేశమైందనే వార్త బయటికి వచ్చిన దగ్గర నుంచి ఈ కుటుంబం బీజేపీలో చేరుతుందనే ప్రచారం జరుగుతోంది. అందకే వారంతా ప్రత్యేకంగా వెళ్లి మోదీని కలిశారని అంటున్నారు. ఈ విషయం పక్కన పెడితే సౌత్ సినిమా ఇండస్ట్రీకి మంచు విష్ణు ఒక గుడ్ న్యూస్ చెప్పారు. దక్షిణాదికి చెందిన సినీ పెద్దలందరితోనూ ఒక సమావేశం ఏర్పాటు చేయమని ప్రధానమంత్రిని తాను కోరానని, దానికి ఆయన అంగీకరించారని విష్ణు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. త్వరలోనే నరేంద్రమోదీని మళ్లీ కలుస్తామని ఆశిస్తున్నానని విష్ణు పేర్కొన్నారు. నరేంద్ర మోదీకి శ్రీమహావిష్ణువు దశావతారం పెయింటింగ్‌ను బహుమతిగా ఇచ్చినట్టు విష్ణు మరో ట్వీట్‌లో తెలిపారు. అలాగే మరో పెయింటింగ్‌పై మోదీ ఆటోగ్రాఫ్ తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఆయన వద్ద నుంచి ఎంతో నేర్చుకోవచ్చని.. ఆయనకు దేవుడు మరింత శక్తి, సామర్థ్యాలను ఇవ్వాలని ఆకాంక్షించామని చెప్పారు.

Related posts