telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

దేశం రెండు భాగాలుగా చీలిపోయింది…దీనివల్ల నష్టం అధికం : అజయ్ దేవగణ్

Tanaji

పౌరసత్వ సవరణ బిల్లుపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీని ప్రభావం సినిమాలపై పడుతున్నదని సినీ విశ్లేషకులు అంటున్నారు. కాగా బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ నటించిన ‘తానాజీ‘ ఈనెల 10 విడుదల కానుంది. ఈ సందర్భంగా అజయ్ దేవగన్ మాట్లాడుతూ “ప్రస్తుతం దేశం రెండు భాగాలుగా చీలిపోయింది. దీనివలన నా సినిమాకు లబ్ధి చేకూరుతుందో లేదో నాకు తెలియదు. దేశంలోని సగం మంది ఒకలా మాట్లాడుతుంటే, మిగిలినవారు మరోలా మాట్లాడుతున్నారు. ఇటువంటి వాతావరణం వలన ఎవరికీ లాభం లేదు. అయితే నష్టం అధికంగా ఉంటుంది” అని అన్నారు. ఈ నేపధ్యంలో ‘దబంగ్-3’ అనుకున్న స్థాయిలో ఆడలేదనే వాదన వినిపిస్తోంది.

Related posts