స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో శ్రీమతి మమత సమర్పణలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతాఆర్ట్స్ పతాకాలపై రూపొందిన చిత్రం ‘అల వైకుంఠపురములో’. ఎస్.రాధాకృష్ణ (చినబాబు) నిర్మించిన ఈ చిత్రానికి… ఎస్.ఎస్.తమన్ సంగీతం అందించారు. ఈ సినిమా మ్యూజికల్ కాన్సర్ట్ సోమవారం హైదరాబాద్ యూసఫ్ గూడ్ పోలీస్ గ్రౌండ్స్లో అభిమానులు, సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో హీరోయిన్ నివేదా పేతురాజ్ మాట్లాడుతూ “ఈ సినిమాలో బన్నీతో కలిసి వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది. తెలుగు, తమిళంలో నేను పనిచేసి పెద్ద సినిమా ఇదే. త్రివిక్రమ్గారు సినిమాను డిఫరెంట్గా తెరకెక్కించారు. బన్నీ, త్రివిక్రమ్, అరవింద్, సుశాంత్, చినబాబు సహా అందరికీ పెద్ద థ్యాంక్స్. సినిమా కోసం ఎగ్జయిటెడ్గా వెయిట్ చేస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చింది.
next post
ఆయన కూడా వలస వచ్చినవాడే కాబట్టి… సోనూసూద్ పై బ్రహ్మానందం కామెంట్స్