telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కలకత్తా బ్యాక్‌డ్రాప్ లో “వేదాళం” రీమేక్

chiru

మెగాస్టార్ హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తమిళ హిట్ మూవీ వేదాళం రీమేక్ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. 2021లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. కాగా తాజాగా అప్డేట్ ప్రకారం ఈ సినిమా కోల్‌కత్తా బ్యాక్‌డ్రాప్ లో నడుస్తోందట. నేపథ్యానికి కథకు మధ్య ప్రత్యేక లింక్ ఉంటుందట. కలకత్తా నేపథ్యాన్ని కథలో యాడ్ చేస్తున్నారట. ఇక 2015లో అజిత్ హీరోగా వచ్చిన వేదాళం మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఆ మూవీలో అజిత్ మాస్ రోల్ ప్రేక్షకులను బాగా మెప్పించింది, ప్రస్తుతం మెహర్ ఈ చిత్రానికి లొకేషన్స్ వేటలో ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ చిత్రానికి ఒరిజినల్ వెర్షన్ లో కీలక ఎపిసోడ్స్ లోని లొకేషన్స్ లోనే తెరకెక్కించాలని అనుకుంటున్నారట. అలాగే ఈ చిత్రంలో చిరు సోదరి రోల్ కు సాయి పల్లవిని ఎంపిక చేశారన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి మణిశర్మ తనయుడు సాగర్ సంగీతం అందివ్వనున్నట్టు టాక్. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ లో కె ఎస్ రామారావు నిర్మించే అవకాశం ఉంది. లేదంటే రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో నిర్మిస్తారట. ఇక కాస్త గ్యాప్ తీసుకొని తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివతో ‘ఆచార్య’ మూవీ చేస్తున్నారు. ‘ఆచార్య’ ఇంకా సెట్స్ పైన ఉండగానే మలయాళంలో హిట్టయిన ‘లూసిఫర్’ సినిమా, మరొకటి తమిళంలో వచ్చిన ‘వేదాళం’ ప్రాజక్టులను కూడా లైన్లో పెట్టారు. వీటిలో రెండు సినిమాలకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు స్పీడుగా జరుగుతున్నాయి.

Related posts