telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

నెల వ్యవధిలోనే ఇటలీలో 3,405 కరోనా మరణాలు

karona virus

చైనాలో పురుడు పోసుకున్న కరోనా వైరస్ ఇప్పుడు ఇటలీలో విజృంభిస్తుంది. ఒక్క నెలలోనే ఆ దేశంలో ఈ మహమ్మారి కారణంగా మృతి చెందినవారి సంఖ్య 3,405కు చేరుకుంది. వైరస్ పుట్టిన చైనాలో మాత్రం నిన్నటి వరకు నమోదైన మరణాలు 3245 మాత్రమే. ఇటలీలో 24 గంటల వ్యవధిలోనే 427 మరణాలు సంభవించడం గమనార్హం.

చైనాలో ఈ మహమ్మారి క్రమంగా కనుమరుగవుతోంది. బుధవారం అక్కడ ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. ఈ విషయాన్ని ఆ దేశ వైద్యశాఖ నిర్ధారించింది. చైనా తర్వాత ఇటలీ, ఇరాన్, స్పెయిన్ దేశాలు కరోనా కోరల్లో చిక్కుకుని అల్లాడుతున్నాయి. స్పెయిన్‌లో మరణించిన వారి సంఖ్య 209 నుంచి ఒక్కసారిగా 767కు పెరిగాయి.

Related posts