telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ప్రత్యేకహోదాపై సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్రం

ప్రత్యేక హోదా… ఉమ్మడి రాష్ట్రం నుంచి ఏపీ విడిపోయినప్పటి నుంచి ఉన్న డిమాండ్‌. రాష్ట్రం విడిపోయేటప్పుడే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీ ఇచ్చింది. 2014 లో అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం కూడా ప్రత్యేకహోదా ఇచ్చి తీరుతామని చెప్పింది. కానీ ఇప్పటి వరకు ఆంధ్రుల డిమాండ్‌ నెరవెరలేదు. అయితే తాజాగా మరోసారి కేంద్రం ప్రత్యేక హోదాపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని తేల్చి చెప్పేసింది కేంద్రం. ఎంపీ రామ్మోహన్‌ నాయుడి ప్రత్యేక హోదాపై అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ సమాధానం ఇచ్చారు. 14 వ ఆర్ధిక సంఘం సిఫార్సు మేరకు ఏ రాష్ట్రానికి హోదా ఇవ్వడం లేదని… ఏపీకి ప్రత్యేక ప్యాకేజీతో పాటు అనేక మినహాయింపులు ఇస్తున్నామని తెలిపారు. తెలుగు రాష్ట్రాల మధ్య అనేక సమస్యలు ఉన్నాయని… సమస్యలను తెలుగు రాష్ట్రాలే పరిష్కరించుకోవాలని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్. మరికొన్ని విభజన హామీలు వివిధ దశల్లో ఉన్నాయని వెల్లడించారు. ప్రాజెక్టులు, విద్యాసంస్థల నిర్మాణం సుదీర్ఘకాలం పట్టే అవకాశం ఉందని తెలిపారు. విభజన హామీల అమలు వివిధ శాఖలతో సమీక్ష చేస్తున్నామని.. విభజన చట్టం అమలు పురోగతిని హోంశా సమీక్షిస్తోందని కేంద్రం స్పష్టం చేశారు.

Related posts