telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణలో దుర్మార్గమైన పాలన: ఉత్తమ్ ఫైర్

uttam congress mp

రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన సాగుతోందని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి‌ ధ్వజమెత్తారు. నేడు జలదీక్షకు సిద్ధమైన కాంగ్రెస్ పార్టీ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేయడంపై  ఉత్తమ్  మండిపడ్డారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవరం రోజున ఇంతకంటే దారుణం మరోటి ఉండదని మండిపడ్డారు. పార్టీ నేతల అరెస్టును ఖండిస్తున్నట్టు చెప్పారు. తమ నేతల ఇళ్ల ముందు ఉన్న పోలీసులు తక్షణం వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు.

శాంతియుతంగా తాము చేయాలనుకున్న కార్యక్రమాలను అడ్డుకోవద్దని కోరారు. మాట్లాడితే అరెస్ట్ చేస్తున్నారని, తెలంగాణను తెచ్చుకున్నది ఇందుకేనా? అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని ఓ నియంత పాలిస్తున్నారని ఉత్తమ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాగా, ఉత్తమ్‌ను కూడా పోలీసులు గృహ నిర్బంధం చేశారు. కాంగ్రెస్‌కే చెందిన మరో సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా నేతల గృహ నిర్బంధాలపై ఉత్తమ్ మండిపడ్డారు.

Related posts