బీజేపీ నేత అరుణ్ జైట్లీ ఆరోగ్యం మరింత విషమించింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో ఈ నెల 9న ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్లో చేరారు. అప్పటి నుంచి వైద్యుల పర్యవేక్షణలో ఉన్న జైట్లీ ఇటీవల కొంత కోలుకున్నట్టు కనిపించారు. గురువారం ఆయనకు డయాలసిస్ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మరింత విషమించినట్టు వైద్యులు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు ఉమాభారతి ఆసుపత్రికి చేరుకుని జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
ఎయిమ్స్ వైద్యులు పదో తేదీ నుంచి జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై ఎటువంటి బులెటిన్ విడుదల చేయలేదు. ఇటీవల ఆయనకు వైద్యులు వెంటిలేటర్ అమర్చారు. అనారోగ్య కారణాల వల్ల ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో జైట్లీ పోటీ చేయలేదు.