telugu navyamedia
రాజకీయ వార్తలు

బీజేపీలో చేరడం ఆనందంగా ఉంది: సైనా నెహ్వాల్

Saina Nehwal bjp

భారత బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ సైనా నెహ్వాల్‌ బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ సమక్షంలో ఆమె బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘బీజేపీలో చేరడం ఆనందంగా ఉంది. దేశం కోసం పని చేసే పార్టీలో చేరాను. దేశ అభివృద్ధి కోసం కష్టపడుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో పనిచేయాలని బీజేపీలో చేరాను. దేశంలో క్రీడాభివృద్ధికి మోదీ సర్కారు ఎంతో చేసింది. కష్టపడి సేవ చేయడానికి నా వంతు కృషి చేస్తాను’ అని ఆమె తెలిపారు.

2012 లండన్‌ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన సైనా నెహ్వాల్‌తో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిర్వహించాలని బీజేపీ భావిస్తోంది. గత లోక్‌సభ ఎన్నికలకు ముందు భారత మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ బీజేపీలో చేరి ఎంపీగా గెలుపొందిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 8న ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.

Related posts