telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీలో అక్రమ మద్యం ఏరులైపారుతోంది: దేవినేని ఉమ

devineni on power supply

ఏపీలో అక్రమ మద్యం ఏరులైపారుతోందని టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు. అదనపు ఆదాయం కోసం మీరుతెచ్చిన అధికధరల నాసిరకం మద్యం బ్రాండ్ల వల్ల ప్రజల ఆరోగ్యం, ప్రాణాలు పోతుంటే ఏం చర్యలు తీసుకున్నారో చెప్పండని సీఎం జగన్ ను ఆయన నిలదీశారు.అక్రమ మద్యం, కాపు సారా ఏరులైపారుతుందని మీవాళ్లే చెబుతున్నారని పేర్కొన్నారు.

శానిటైజర్లు తాగి 2 రోజుల్లో ఏడుగురి ప్రాణాలు పోయాయని అన్నారు. ఈ సందర్భంగా పలు పత్రికల్లో వచ్చిన వార్తలను దేవినేని ఉమ పోస్ట్ చేశారు. అధిక మత్తు, కిక్కు కోసం మిథైల్‌ ఆల్కహాల్‌ వంటి విషపూరిత రసాయనాలు, శానిటైజర్లు తాగి కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని పత్రికల్లో కథనాలు ప్రచురించారు. ఆది, సోమవారాల్లో విశాఖపట్నంలో ఐదుగురు, కడప జిల్లాలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు.

Related posts