టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ను ఈ రోజు ఉదయం పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఎలాగైనా తాను బయటకు వెళ్తానని ఆయన చెప్పిన విషయం తెలిసిందే. అయితే, ఆయనకు పోలీసులు ఆ అవకాశం ఇవ్వకపోవడంతో ఐదు గంటలుగా ఆయన నివాసంలోనే నిరసన తెలుపుతున్నారు.
ఈ సందర్భంగా ఆయన మరోసారి మీడియాతో మాట్లాడుతూ… పోలీసులు తనను అక్రమంగా నిర్బంధించారని మండిపడ్డారు. రాజధానిలో జరుగుతోన్న ఈ గందరగోళంపై పార్లమెంటులో తాను హక్కుల నోటీసు ఇస్తానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తుతానని చెప్పారు. ప్రజలు, రైతులు పెద్ద ఎత్తున జాతీయ రహదారిపైకి వచ్చారని గల్ల జయదేవ్ అన్నారు.
ప్రశ్నిస్తున్నందునే నన్ను సస్పెండ్ చేశారు: అచ్చెన్నాయుడు