telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

శర్వా మహా సముద్రం టైటిల్ పోస్టర్ రిలీజ్…

ఆర్ ఎక్స్100 సినిమాతో  సంచలనం సృష్టించిన దర్శకుడు అజయ్ భూపతి. కార్తికేయ హీరోగా నటించిన ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటించింది. ఆర్ ఎక్స్ 100 సినిమా తో యువతను ఆకట్టుకున్న అజయ్ భూపతి రెండో సినిమాకు కొంత గ్యాప్ తీసుకున్నాడు. అయితే అజయ్ తన రెండో సినిమాకు మహాసముద్రం అనే పేరు పెట్టాడు. అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోలు శర్వానంద్, సిద్దార్థ్ నటించనున్నారు. అయితే సిద్దార్థ్ తెలుగులో స్ట్రైట్ సినిమా చాలా కాలం అయింది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించబోతున్న ఈ సినిమాలో సాయి పల్లవి, అదితి రావు హైదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో యాక్షన్, డ్రామా, లవ్ ఉంటాయని అలాగే ఆర్ ఎక్స్ 100 తో హిట్ అందుకున్న అజయ్ ఇప్పుడు అంతకంటే సూపర్ హిట్ సినిమా తీయబోతున్నాడని ఇంతకముందే చిత్రబృందం తెలిపింది. అయితే ఈ రోజు దీపావళి సందర్బంగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ విడుదల చేసింది చిత్రబృందం. ఈ పోస్టర్ అభిమానులను ఆకట్టుకోవడం మాత్రమే కాకుండా సినిమా పై ఆసక్తిని కూడా పెంచింది. చూడాలి మరి సినిమా ఎలా ఉంటుంది అనేది.

Related posts