ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా మే 21 నుంచే బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. అయితే విజయవాడ, విశాఖపట్టణంలో సిటీ బస్సులు ప్రారంభం కాలేదు. ఇక ఈ బస్సు సర్వీసులను ఈ నెల 20 నుంచి నడిపేందుకు ఏపీఎస్ ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది.
ఈ నెల 20 నుంచి 26 వరకు గ్రామ/వార్డు సచివాలయ పోస్టుల రాత పరీక్షలు జరగనున్నాయి. సుమారు 10 లక్షల మంది పరీక్షలు రాయనున్నారు.ఈ నేపథ్యంలో బస్సులు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో 20 నుంచి సిటీ బస్సు సర్వీసులను తిప్పేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
హెల్త్ ప్రొటోకాల్ ప్రకారం సిటీ బస్సు సర్వీసులు నడవనున్నాయి. ఈ మేరకు ఏపీఎస్ఆర్టీసీ, సిద్ధం చేసిన ప్రణాళికను వైద్యారోగ్య ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి అనుమతి కోసం పంపింది. ఉన్నాతాధికారులు అనుమతిస్తే సిటీ బస్సు సర్వీసులు రోడ్డెక్కనున్నాయి.
సచివాలయం కూల్చివేత కోర్టు ధిక్కరణే: ఎమ్మెల్సీ జీవన్రెడ్డి