ఆర్బీఐ పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్బీ) మీద రూ.50లక్షల జరిమానా విధించింది. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ఖాతాలో చోటుచేసుకున్న మోసం గురించి వెల్లడించడంలో ఆలస్యమే కేంద్రబ్యాంకు చర్యకు కారణమని పీఎన్బీ తెలిపింది. ‘పంజాబ్ నేషనల్ బ్యాంకు జులై 10, 2018లో సమర్పించిన ఫ్రాడ్ మానిటరింగ్ నివేదిక-1 ద్వారా కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్లో జరిగిన మోసాన్ని వెల్లడించడంలో ఆలస్యం చేసిందని ఆర్బీఐ గుర్తించింది’ అని పీఎన్బీ పేర్కొంది.
బ్యాంకింగ్ రెగ్యులేటరీ చట్టం కింద ఈ జరిమానా విధించినట్లు వెల్లడించింది. ఖాతాలోని మోసాన్ని వెల్లడించడంలో ఆలస్యంచేసినందుకు బ్యాంక్ ఆఫ్ బరోడా మీద కూడా రూ.50లక్షల జరిమానా పడింది.