నెల్లూరు, కృష్ణపట్నం ఆనందయ్య మందు పంపిణీ పై సందిగ్ధత ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం కృష్ణపట్నంలో 144 సెక్షన్ విధించిన పోలీసులు… ఆనందయ్య మందు కోసం వచ్చే వారిని వెనక్కి పంపుతున్నారు. ఎందుకంటే… గత రెండు రోజులుగా ఆనందయ్య మందు పంపిణీ కార్యక్రమం నిలిచిపోయింది. ప్రస్తుతం నెల్లూరు అధికారుల ఆధీనంలో ఉన్నారు ఆనందయ్య. ఇక నిన్న ఆయూష్ కమిషనర్ రాములు సమక్షంలో మందు తయారు చేసారు ఆనందయ్య. అయితే ఆ మందులో హానికర పదార్థాలు లేవని ఆయూష్ కమిషనర్ పేర్కొన్నారు. కానీ ఆనందయ్య తయారు చేస్తున్న మందుని ఆయుర్వేదంగా గుర్తించలేమన్న రాములు… ఆనందయ్య తయారు చేస్తుంది నాటు మందుగా తేల్చారు. ఇవాళ సాయంత్రానికి ఆనందయ్య మందు పై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు రాములు. ఇక ఈరోజు సాయంత్రానికి నెల్లూరు రానున్న ఐసీఎంఆర్ బృందం సమక్షంలో రేపు మరో సారి మందు తయారు చేయనున్నాడు ఆనందయ్య.
next post
తెలంగాణలో బీజేపీ బలపడటాన్ని కేసీఆర్ తట్టుకోలేకపోతున్నారు