telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

షర్మిలతో ఆర్కే సమావేశం..!

వైఎస్ షర్మిల ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. ఆమ్ కొత్త పెట్రీ పెట్టడం ఇప్పుడు హల చేస్తుంది. అయితే ప్రస్తుతం వరుస భేటీలతో ఆమె సమాలోచనలు చేస్తున్నారు. అయితే, వైఎస్ షర్మిలతో భేటీ అయ్యారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. బ్రదర్ అనిల్‌తో కూడా సుదీర్ఘ మంతనాలు జరిపారు ఎమ్మెల్యే ఆర్కే.. వైసీపీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్ పంపిన దూతగానే ఆర్కే వచ్చిఉంటారని,  ఆయన అనుమతితోనే షర్మిల, బ్రదర్ అనిల్‌తో మంతనాలు జరిపిఉంటారని సమాచారం. అయితే, షర్మిల, బ్రదర్ అనిల్‌తో ఎమ్మెల్యే ఆర్కే ఏం చర్చించారన్నది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.. ఇవాళ ఉదయం లోటస్‌పాండ్‌కు వచ్చిన ఆర్కే.. దాదాపు గంటకు పైగా షర్మిలతో మంతనాలు జరిపారు. ఆ తర్వాత బ్రదర్‌ అనిల్‌తో దాదాపు 3 గంటలకు పైగా చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. వైఎస్ జగన్‌కు సన్నిహితుడిగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి.. ఆయన దూతగానే చర్చలకు వచ్చారనే చర్చ మాత్రం జోరుగా సాగుతోంది. అయితే, షర్మిల పార్టీ ఏర్పాటు విషయంలో దూకుడుగా ముందుకు వెళ్తుండగా.. ఆమెను ఆపే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా..? అనే చర్చ కూడా మొదలైంది. మరోవైపు.. వైఎస్ కుటుంబానికి వీరవిధేయుడిగా ఉన్న ఆర్కేకు.. షర్మిలతో, బ్రదర్ అనిల్‌తో మంచి సంబంధాలున్నాయి. చుడాలిమరి ఇంకా ఏం జరుగుతుంది అనేది.

Related posts