శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో గోటబయ రాజపక్స తన ప్రత్యర్థి, అధికార యూఎన్పీ నేత సజిత్ ప్రేమదాసపై విజయం సాధించారు. అధికారికంగా ఇవాళ సాయంత్రం ఆయన విజయాన్ని ఎన్నికల కమిషన్ ప్రకటించనుంది. అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన రాజపక్సకు భారత ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఆదివారంనాడు మోదీ ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు.
‘అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన మీకు నా అభినందనలు. ఉభయ దేశాలు, పౌరుల మధ్య చిరకాలంగా కొనసాగుతున్న సంబంధాలను మరింత పటిష్టం చేసుకునేందుకు, ఇరు ప్రాంతాల భద్రత, శాంతి, అభ్యున్నతి కోసం మీతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నాను’ అని మోదీ ఆ ట్వీట్లో పేర్కొన్నారు.