telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ముస్లిం లా బోర్డులో హైదరాబాద్‌కు చెందిన ఓ ద్రోహి: రాజాసింగ్

BJP-MLA Raja-Singh

అయోధ్య విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్‌బీ) తీర్మానించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. ముస్లిం లా బోర్డు అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. ఆ బోర్డులోని అవినీతిపరుల్లో హైదరాబాద్‌కు చెందిన ఓ ద్రోహి కూడా ఉన్నారంటూ పరోక్షంగా అసదుద్దీన్‌ను ఒవైసీని ఉద్దేశించి ఆరోపించారు.

మొఘలుల హయాంలో 40 వేల ఆలయాలను ధ్వంసం చేసి మసీదులను నిర్మించారని రాజాసింగ్ ఆరోపించారు. వాటన్నింటిని తిరిగి నిర్మించాలని హిందువులు డిమాండ్ చేస్తారని అన్నారు. సుప్రీం తీర్పుతో హిందూ, ముస్లింలు ఆనందంగా ఉన్నారన్నారు. ఈ సమస్యకు ఇక్కడితో ముగింపు పలకాలని రాజాసింగ్ హితవు పలికారు.

Related posts