ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్వో)కు చైనా మరోసారి భారీ విరాళం ప్రకటించింది. మరో 30మిలియన్ డాలర్ల విరాళం ఇస్తున్నట్లు గురువారం డ్రాగన్ దేశం ప్రకటించింది. ప్రపంచ ఆరోగ్యసంస్థకు చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నదని ఆరోపిస్తూ అమెరికా తన నిధులను నిలిపేసిన నేపథ్యంలో చైనా తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేస్తున్న నేపథ్యంలో చైనా ఇటీవలే డబ్ల్యూహెచ్వోకు 20మిలియన్ డాలర్ల విరాళం ఇచ్చింది. తాజాగా మరో 30మిలియన్ డాలర్లు అందించాలని నిర్ణయించిందని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి జెంగ్షాంగ్ తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా డబ్ల్యూహెచ్వో పట్ల చైనా తమ నమ్మకాన్ని మరోసారి చాటిచెప్పారని జెంగ్షాంగ్ అన్నారు.