telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

డబ్ల్యూహెచ్వోకు చైనా మరోసారి భారీ విరాళం

who modi

ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్‌వో)కు చైనా మరోసారి భారీ విరాళం ప్రకటించింది. మరో 30మిలియన్‌ డాలర్ల విరాళం ఇస్తున్నట్లు గురువారం డ్రాగన్ దేశం ప్రకటించింది. ప్రపంచ ఆరోగ్యసంస్థకు చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నదని ఆరోపిస్తూ అమెరికా తన నిధులను నిలిపేసిన నేపథ్యంలో చైనా తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేస్తున్న నేపథ్యంలో చైనా ఇటీవలే డబ్ల్యూహెచ్‌వోకు 20మిలియన్‌ డాలర్ల విరాళం ఇచ్చింది. తాజాగా మరో 30మిలియన్‌ డాలర్లు అందించాలని నిర్ణయించిందని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి జెంగ్‌షాంగ్‌ తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా డబ్ల్యూహెచ్‌వో పట్ల చైనా తమ నమ్మకాన్ని మరోసారి చాటిచెప్పారని జెంగ్‌షాంగ్‌ అన్నారు.

Related posts