telugu navyamedia
రాజకీయ

మోదీ మాటలను, ప్రభుత్వ చేతలను నమ్మలేం: అమర జవాను భార్య 

Modi wishes to Imran Pakistan
ఉగ్రదాడిలో అమరుడైన జవాను ప్రదీప్ సింగ్ కుటుంబసభ్యులు ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోదీ మాటలను, ప్రభుత్వ చేతలను నమ్మలేమని ప్రదీప్ సింగ్ భార్య నీరాజ్ అన్నారు. గతంలో కూడా కశ్మీర్ లో ఉగ్రదాడులు జరిగాయని, అయినప్పటికీ  భద్రతాదళాలకు పూర్తి స్వేచ్ఛను ఎందుకు ఇవ్వలేదని ఆమె ప్రశ్నించారు. ఈ నిర్లక్ష్యమే తాజా మారణహోమానికి కారణమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రదీప్ సింగ్ తండ్రి మాట్లాడుతూ, జవాన్ల త్యాగాలను ప్రభుత్వం ఎప్పుడూ గౌరవించలేదన్నారు. జవాన్ల త్యాగాలను ప్రజలు రెండు, మూడు రోజుల్లో మర్చిపోతారని అన్నారు. సర్చికల్ స్ట్రైక్స్ గురించి ప్రభుత్వం గొప్పగా చెప్పుకుందని, కానీ, ఉగ్రదాడుల మాత్రం ఆగిపోలేదని అన్నారు. ప్రదీప్ సోదరుడు మాట్లాడుతూ ప్రాణాల కంటే ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం విలువైంది కాదని అన్నారు.

Related posts