telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

లోకేష్‌పై విజయసాయిరెడ్డి విమర్శలు…

vijayasaireddy ycp

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌ వేదికగా చంద్రబాబు,లోకేష్‌పై మరోసారి విమర్శలు గుప్పించారు. లోకేష్‌ను అయితే.. ఏకంగా పప్పు అంటూ సంభోదించారు విజయసాయిరెడ్డి.  “లోకేష్ తాను పప్పులకే పప్పని  నిరూపించుకున్నాడు.1978లోనే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను టీడీపీ అడ్డుకుందట. ఉద్యమాలు చేసిందట! టీడీపీ పుట్టింది1982లో కదా చిట్టీ? అవునులే, మీ నాన్న స్వతంత్ర పోరాటం చేశానని చెప్పుకున్నాడు. నీవు 78లోనే విశాఖ ఉక్కు కోసం పోరాడే ఉంటావు !” అంటూ విజయ్‌ సాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ఇక అంతకు ముందు ట్వీట్‌లో చంద్రబాబుపై  కామెంట్‌ చేశారు విజయసాయిరెడ్డి. “టీడీపీ ఇంకా బ్రతికే ఉందని చెప్పేందుకు భ్రమ రాజకీయాలు చేస్తున్నాడు  చంద్రబాబు. పచ్చ కుల మీడియాలో ఫేక్ న్యూస్ వేయించినంత మాత్రాన పంచాయతీలు గెలిచినట్లా?  మీ భార్య దత్తత తీసుకున్న కొమరవోలులో టీడీపీ బలపరిచిన అభ్యర్థి ఓడారు. నీ జిల్లా, మీ అత్త గారి జిల్లాలోనూ వైసీపీ ప్రభంజనమే బాబూ.” అంటూ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. చూడాలి మరి దీని పై చంద్రబాబు,లోకేష్‌ ఎలా స్పందిస్తారు అనేది.

Related posts