బెజవాడలో ఓ ప్రేమోన్మాది యువతీ ఇంటికి వెళ్లి మరీ ఆమెపై కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. విజయవాడలో ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థిని దివ్య తేజస్విని.. స్థానికుడైన స్వామి.. కొంతకాలంగా ప్రేమపేరుతో వేధింపులకు గురిచేస్తున్నాడు.. అయితే, ఆ యువతి అతడి ప్రేమను తిరస్కరిస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఇవాళ యువతి ఇంటికి వెళ్లిన స్వామి.. కత్తితో ఆమె మెడపై దాడి చేశాడు. ఈ ఘటనలో దివ్య తేజస్విని మృతి చెందింది. ఈ ఘటనపై టీడీపీ నేత నారా లోకేష్ స్పందించారు.
“బంగారు భవిష్యత్తు ఉన్న దివ్య ప్రేమోన్మాది చేతిలో బలైపోవడం దారుణం. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు. వరుస ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. వారం రోజుల వ్యవధిలోనే అరడజనుకు పైగా ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. వరుసగా మృగాళ్లు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నా YS Jagan Mohan Reddy గారు మౌనం వహించడం సరికాదు. చట్టరూపం దాల్చని దిశ చట్టం, ఆర్భాటంగా ప్రారంభించిన దిశ పోలీస్ స్టేషన్లు, అధికారంలేని హోంమంత్రి గారు. ఇక మహిళలకు న్యాయం జరిగెదెప్పుడు?” అంటూ లోకేష్ ఫైర్ అయ్యారు.