మహారాష్ట రాజకీయాల్లో నిన్న రాత్రి అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. శివసేన నేత, లోక్ సభ సభ్యుడు సంజయ్ రౌత్, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఓ స్టార్ హోటల్ లో రహస్యంగా భేటీ అయినట్టు వార్తలు గుప్పుమన్నాయి. ఈ విషయం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో సంజయ్ రౌత్ వివరణ ఇచ్చారు. పలు అంశాలపై చర్చించడానికే తాను నిన్న దేవేంద్ర ఫడ్నవీస్ను కలిశానని సంజయ్ రౌత్ తెలిపారు.
ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి అని, మహారాష్ట్ర ప్రతిపక్ష నాయకుడని అన్నారు. అంతేగాక, బీహార్ శాసనసభ ఎన్నికల్లో ఆయన బీజేపీ ఇన్ఛార్జీగా ఉన్నారని గుర్తు చేశారు. తమ మధ్య సైద్ధాంతిక విభేదాలు ఉన్నప్పటికీ, తాము శత్రువులం కాదని చెప్పారు. తాము సమావేశమైనట్లు సీఎం ఉద్ధవ్ థాకరేకు తెలుసని స్పష్టం చేశారు.వీరిద్దరి భేటీపై ఇప్పటికే స్పందించిన బీజేపీ వివరణ ఇచ్చింది. సామ్నా పత్రిక కోసం ఓ ఇంటర్వ్యూ విషయంలో ఫడ్నవీస్ను సంజయ్ రౌత్ కలిశారని స్పష్టం చేసింది.
ఏ ఆస్పత్రిలో చూసినా మందుల కొరత: ఉత్తమ్