telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

ఏపీలో జనాభా తగ్గుతోంది.. చంద్రబాబు ఆందోళన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనాభా తగ్గుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ   జనాభా తగ్గిపోతే రోబోలు తయారు చేసుకోవాల్సిన పరిస్థితి దాపురిస్తుందని అన్నారు. ఏపీ మరో జపాన్ లా కాకూడదని చంద్రబాబు పేర్కొన్నారు.  పిల్లలను కనడం వల్ల రాష్ట్రాన్ని కాపాడుకోగలుగుతామని ఆయన తెలిపారు. 
అభివృద్ధి చెందామనే భావనతో, పిల్లలను వద్దనుకోవడం సరికాదన్నారు. పిల్లలను వద్దనుకోవడం వల్ల జపాన్ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటోందని చెప్పారు. వృద్ధుల సంఖ్య పెరిగిపోయి, యువతరం తగ్గిపోయి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుందని వివరించారు.

Related posts