telugu navyamedia
రాజకీయ వార్తలు

కాలేజీల్లో మొబైల్స్ వాడకంపై నిషేధం..యూపీ విద్యాశాఖ అదేశం

cell phone

ఉత్తర ప్రదేశ్ ఉన్నత విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో మొబైల్స్ వాడకాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ నిషేధం అధ్యాపకులకు కూడా వర్తిస్తుందని పేర్కొంది. విద్యార్థులు విద్యనభ్యసించడానికి సరైన వాతావరణం కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం పేర్కొంది.

తాజా ఉత్తర్వుల ప్రకారం విద్యార్థులు, అధ్యాపకులు క్యాంపస్ లోకి మొబైల్స్ తీసుకు రావటం, ఉపయోగించడం కూడదు. కాగా, రాష్ట్ర ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ కూడా మితిమీరిన మొబైల్స్ వాడకంపై ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రి వర్గ సమావేశాల్లో కూడా కొందరు సభ్యులు తమ మొబైల్స్ చూస్తూ సందేశాలు చదువుతూ ఎజెండా విషయాలను పక్కన పెడుతున్నారని సమావేశాల్లో మొబైల్స్ వాడొద్దని ఆదేశాలిచ్చారు.

Related posts