telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

వైఎస్‌ వివేకా హత్య కేసులో ఊపందుకొన్న సీబీఐ విచారణ

ys vivekananda reddy

మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ ఊపందుకుంది.ఈ రోజు పులివెందులకు చెందిన వైసీపీ నేత, కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్ రెడ్డికి సన్నిహితుడు దేవిరెడ్డి శివశంకర్‌ రెడ్డి కడపలో సీబీఐ విచారణకు హాజరయ్యారు.

వివేకా కుమార్తె సునీత ఈ కేసులో హైకోర్టుకు సమర్పించిన 15 మంది అనుమానితుల జాబితాలో శివశంకర్‌ రెడ్డి పేరు కూడా ఉంది. హత్య జరిగిన రోజు ఘటనా స్థలిలో వైఎస్‌ కుటుంబ సభ్యులతోపాటు ఆయన కూడా ఉన్నారు. ఆయన సాక్ష్యాలు తారుమారు చేయడానికి సహకరించారని ఆరోపణలు ఉన్నాయి.

గతంలో శివశంకర్‌ రెడ్డిని ఐదు రోజులపాటు ప్రత్యేక దర్యాప్తు సంస్థ అధికారులు విచారించారు. సిట్‌ అధికారులు ఈ కేసును ఛేదించలేకపోయారు. మరోవైపు శంకర్‌ రెడ్డిపై వివేకా కుమార్తె సునీత అనుమానం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. వివేకా హత్య జరిగిన తర్వాత కొందరు అనుమానితులతో ఆయన మాట్లాడినట్లు సునీత హైకోర్టుకు తెలిపారు.

Related posts