telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

జల వివాదం రెండు రాష్ట్రాల మధ్య ఎమోషనల్ గేమ్ ప్లాన్…

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదంపై ఎమోషనల్ గేమ్ ప్లాన్ నడుస్తుంది అని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాబోతు రమేష్ అన్నారు. ఎప్పుడు నీటి గొడవలు వచ్చినా రాజకీయ ప్రయోజనాల కోసం తప్ప ప్రజా ప్రయోజనాల మాత్రం కాదు. కేసీఆర్, జగన్ ఇద్దరు నవ ప్రేమికులు. కేసీఆర్ నీటిని తెలంగాణకు తరలిస్తూ ఏపీలో దొంగతనం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. తెలంగాణలో వైఎస్ షర్మిల రాజకీయ భవిష్యత్తు కోసం జగన్ మిన్నకుండిపోయారు. మేనేజ్మెంట్ బోర్డు, జలశక్తి మినిస్టర్ల దృష్టికి సమస్యను తీసుకెళ్ళకుండా ప్రధానికి లేఖ రాస్తే ఏం లాభం అని ప్రశ్నించారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డిని అవమానకరంగా మాట్లాడుతుంటే మిన్నుకుండిపోతారా..ఆస్థులు, రాజకీయ ప్రయోజనాల కోసమేనా వారసత్వం. ఇప్పటి వరకు గాలేరు,నగిరి,హంద్రీనీవా ప్రాజెక్టులు పూర్తి చేయలేదు. ఈనెల 4వ తేదీ ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కర్నూలులో ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించబోతున్నాం అని పేర్కొన్నారు.

Related posts