పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం వరుస మరణాలు అసెంబ్లీని కుదుపేస్తున్నాయి. సభ మొదలైనప్పటి నుంచి టీడీపీ సభ్యులు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. వరుస మరణాలపై టీడీపీ సభ్యులు చర్చకు పట్టుపట్టారు.
స్పీకర్ పోడియం వద్దకు దూసుకొచ్చారు. పైకి ఎక్కి, స్పీకర్ కుర్చీని చుట్టుముట్టి కాగితాలు చింపి స్పీకర్ పైన వేశారు. దీంతో సభలోకి మార్షల్స్ వచ్చి టీడీపీ సభ్యులను నిలువరించే ప్రయత్నం చేశారు.
దీనిపై స్పీకర్ తమ్మినేని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సభ్యత సంస్కారం లేదా అంటూ నిలదీశారు.సభను పదేపదే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో అసెంబ్లీని స్పీకర్ వాయిదా వేశారు.