telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

మాజీ స్పీకర్ కోడెల కుమార్తెపై కేసు!

భూ యజమానులను బెదిరించారన్న ఆరోపణలపై ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమార్తె డాక్టర్ పూనాటి విజయలక్ష్మితో పాటు ఆమె అనుచరులపై నరసరావుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. 2002లో పూదోట మారయ్య అనే వ్యక్తి నుంచి నరసరావుపేటకు చెందిన అర్వపల్లి పద్మావతి అనే మహిళ కేసానుపల్లి వద్ద ఎకరం భూమిని కొనుగోలు చేసింది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత విజయలక్ష్మి కన్ను ఈ భూమిపై పడింది.

నకిలీ పత్రాలను సృష్టించి, భూమి వద్దకు వెళ్లిన విజయలక్ష్మి అనుచరులు బొమ్మిశెట్టి శ్రీనివాసరావు, కళ్యాణం రాంబాబులు పద్మావతిని బెదిరించారు. ఈ భూమి తమదేనని, మరోమారు ఇక్కడికి వస్తే హత్య చేస్తామని హెచ్చరించారు. గతవారం మరోమారు బాధితురాలు పొలం వద్దకు వెళ్లగా, ఆమెపై దాడి చేశారు. దీంతో పద్మావతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసును రిజిస్టర్ చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టామని తెలిపారు.

Related posts