*చంద్రబాబు పాలనలో ఎనీటైమ్ మందు
*చంద్రబాబు పాలనలో మద్యం ఏరులై పారించారు..
*చంద్రబాబు పాలనకు ప్రజలు ఛీ కొట్టి ఇంట్లో కూర్చోపెట్టారు.
*మద్యం సిండికేట్లతో చంద్రబాబు కుమ్మక్కయ్యారు..
*చంద్రబాబు పాలనలో ఆడవారి జీవితాలు నాశనమయ్యాయి.
జంగారెడ్డి గూడెంలో వరుస మరణాలు అసెంబ్లీని కుదుపేస్తున్నాయి. ఈ అంశంపై సభలో అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్ష పార్టీ టీడీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది.
ఈ సందర్భంగా టీడీపీ సభ్యులపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తనదైన శైలిలో విరుచుకుపడ్డారు మద్యం సిండికేట్లతో చంద్రబాబు కుమ్మక్కయ్యారని ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు.
బెల్టుషాపులు ఎత్తేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చి 40వేల షాపులు తెరిచారని ఆమె దుయ్యబట్టారు. చంద్రబాబు పాలనలో మద్యాని ఏరులై పారించారని రోజా మండిపడ్డారు.
ఎనీ టైం మందు దొరికే తరహాలో పరిపాలించారు. బడి, గుడి అనే తేడా లేకుండా బెల్టు షాపులు పెట్టించారు. ఇంటింటికీ క్వార్టర్ అందించే పరిస్థితి తెచ్చారు’’ అని ఎమ్మెల్యే రోజా మాట్లాడారు.
వైసీపీ రౌడీలు మరో అడుగు ముందుకేశారు: నారా లోకేశ్