telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

గ్యాస్ లీకేజ్ ఘటన కలచివేసింది: పవన్ కల్యాణ్

pawan

విశాఖపట్టణంలో గ్యాస్ లీకేజ్ ఘటన తనను కలచివేసిందని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఈ ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు పవన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం ఈరోజు ఉదయం ఐదున్నర గంటల నుంచే తనకు అందిందని చెప్పారు. స్థానికంగా ఉన్న జనసేన నాయకులు సంబంధిత వీడియోలను తమ పార్టీ జనరల్ సెక్రటరీకి పంపించారని, ఆయన ద్వారా తనకు అందాయని చెప్పారు.

ఈ ఘటన తీవ్రత తెలిసే కొద్దీ ఆందోళన చెందానని, దారి పొడవునా కింద పడిపోయిన మహిళలు, చిన్నారులతో పాటు చనిపోయిన మూగజీవాలు ఉండటం తనకు చాలా ఆవేదన కల్గించిందని అన్నారు. సమాచారం తెలిసిన వెంటనే జనసేన పార్టీ నాయకులు స్పందించి సహాయ కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా ఉపశమనం కలిగించిందని పేర్కొన్నారు.

Related posts